బీజేపీ అధికారంలోకి యాభై రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాగ్దానంపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు..
సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్వట్టర్లో పోస్టు చేశారు కేటీఆర్. చీప్ లిక్కర్ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానామా? లేదా బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజాగా సోము వీర్రాజు, కేటీఆర్ ను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చీఫ్ లిక్కర్ అని..టీఆర్ఎస్ కాస్లీ లిక్కర్ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
ఎక్కడున్నా మద్యం, ఎప్పుడైనా మద్యం, మద్యం పేరుతో దోచుకోవడం, ప్రజలను, యువతను మద్యానికి బానిసలు చేయడం.. మహిళల భద్రతను పక్కనపెట్టి జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు
స్కూల్ పక్కన మద్యం, ప్రతి గ్రామంలో మద్యం.. ఏ సమయంలోనైనా మద్యం పేరుతో నాయకులు ప్రజల రక్తం పీల్చుతున్నారంటూ కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు.
“కాళేశ్వరం” కు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపం కాంగ్రెస్దే: మంత్రి హరీశ్ రావు