ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి యాభై రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని సోము వీర్రాజు చేసిన వాగ్దానంపై పలువురు నేతలు మండిపడుతున్నారు.
మంగళవారం విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ బహిరంగ సభలో వీర్రాజు ప్రసంగిస్తూ.. మద్యం సేవించే కోటి మంది ప్రజలు 2024లో బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే..75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని.. రాష్ట్ర ఆదాయం మెరుగుపడితే ప్రభుత్వం ధరను రూ.50కి తగ్గిస్తామని హామీనిచ్చారు..
అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు..”వా… వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్.. ఏపీ బీజేపీ కొత్త పతనానికి దిగజారింది.. చీప్ లిక్కర్ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానమా?.. నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఇస్తున్నారా..?’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. .
అలాగే సోము వీర్రాజుకు మతి భ్రమించినట్లుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇకపై ఆయన్ను సారాయి వీర్రాజుగా పిలవాలేమో అంటూ సెటైర్లు వేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low
National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu
— KTR (@KTRTRS) December 29, 2021
బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడు: ఎంపీ కవిత