telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీవీకి ‘భారతరత్న’ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం

kcr telangana

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీ నరసింహారావేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం నిలిచేందుకు పీవీ సంస్కరణలే కారణమని అన్నారు. పీవీ తెలంగాణ బిడ్డ అని, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రాజనీతజ్ఞుడు అని వివరించారు.

దేశ ప్రగతికి ఉజ్వలమైన బాటలు వేసిన మహన్నోత దార్శనికుడని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు మరణానంతరం ‘భారతరత్న’ ఇవ్వాలని, ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ ప్రకటన చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. 

Related posts