telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇందిరా గాంధీ జయంతి .. పలువురు నివాళులు..

tribute to indhira gandhi

నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కావడంతో పలువురు నివాళులు అర్పించారు. అందులో ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్‌లో నివాళి సందేశాన్ని వినిపించారు. ఇక ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ నేతలు ఇందిరకు నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు.. ఇందిరా సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు.

కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇందిరకు నివాళి అర్పించింది. దేశ తొలి మహిళా ప్రధానికి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పింది. ఆమె ఆశయం, పట్టుదల దేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి చేర్చినట్లు తెలిపింది. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానం కోసం ఇందిరా గాంధీ ఎంతో చేసినట్లు కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్‌లో పేర్కొన్నది.

Related posts