‘పత్రిక గ్రూప్’ ఛైర్మన్ గులాబీ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు మనవైపే చూస్తున్నాయని అన్నారు. మనం చెప్పే మాటను వింటాయని మోదీ పేర్కొన్నారు.
భారతీయ సమాచారాన్ని శ్రద్ధగా తెలుసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ గ్లోబల్ మీడియాగా ఎదగాలని చెప్పారు.భారత మీడియా ఖండాంతరాలను దాటి వెళ్లాలని పిలుపునిచ్చారు. యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు. సోషల్ మీడియా పాప్యులర్ అవుతున్న ఈరోజుల్లో యువత విజ్ఞానాన్ని పెంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గి: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ