telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఆయుధం “బ్లాక్ మెయిల్” : రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ఓడిపోతే పదవులు ఊడిపోతాయని తమ మంత్రులను స్వయంగా కేసీఆరే బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత తమ పార్టీ పై ఉందని అన్నారు.

ఏ ఎన్నికల్లో అయినా సీఎం కేసీఆర్ గెలిచేందుకు ఎన్నుకున్న ఆయుధం ‘బ్లాక్ మెయిల్’ అని ఆరోపించారు. 120 మున్సిపాలిటీల్లో, 10 కార్పొరేషన్లలో ‘బ్లాక్ మెయిల్’ ఆయుధాన్ని మంత్రులకు ఇచ్చి ఆంబోతుల్లా వారిని ప్రజలపైకి వదిలితే, ఈ ప్రతిపక్షాలపై, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, బెదిరింపులు, కేసులు బనాయించడం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలను, ప్రజలను కేసీఆర్ నమ్ముకోలేదని, డబ్బు, మద్యం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులపై ఆయన ఆధారపడి విజయం సాధించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బు, పోలీసులు, మద్యం, ఎన్నికల నిర్వహణ అధికారులు అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి తాము శాయశక్తులా ప్రయత్నించామని అన్నారు.

Related posts