telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు: విపక్షాలపై తలసాని ఫైర్

talasani srinivas yadav

ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలపై మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

పల్లె పల్లెల్లో రైతులు ఆనందంగా ఉండటం కోసమే అన్ని వసతులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలోనే పండుతున్నాయని తెలిపారు. గతంలో గోపాలమిత్ర జీతాలను రూ.3000 వేల నుండి రూ.8000 వేల వరకు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

Related posts