భారత్ నుంచి అజ్మన్ వెళ్లి ఇంగ్లీష్ టీచర్గా పని చేస్తున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిని మహిళను అజ్మన్లోని ఆల్ గఫియా ప్రాంతంలో నివాసముంటున్న 32 ఏళ్ల ఏస్ఏమ్ మార్జొనాగా గుర్తించారు. తాను చనిపోతున్నట్లు స్నేహితుడికి వాట్సాప్లో సమాచారం ఇచ్చి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వాట్సాప్లో స్నేహితుడికి పంపించిన ఫోటోలో ఆమె మెడ చుట్టు ఓ క్లాత్ చుట్టుకొని ఉండడం కనిపించింది. అది చూసిన స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి స్నేహితుడి సమాచారం మేరకు ఆమె ఇంటికి వెళ్లే సరికి ఉరి వేసుకొని ఉందని, కొన ఊపిరితో ఉండడంతో ఆల్ కసిమి ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు ఆమెను కాపాడేందకు యత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయిందన్నారు. మార్జొనా స్నేహితుడిని పోలీసులు వాకాబు చేయగా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందని, పిల్లలు ఇండియాలోనే ఉన్నట్లు తెలిపాడు. తనకు వాట్సాప్లో సూసైడ్ చేసుకుంటున్నట్లు ఫొటో రావడంతో ఆమెను అలా చేయొద్దని వారించినట్లు పేర్కొన్నాడు. అనంతరం ఆమె ఇంటికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే ఆమె మెడకు తాడుతో వేలాడుతూ కనిపించదన్నాడు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post