కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, సీఎం జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.
కరోనాపై ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని యామల దుయ్యబట్టారు.
చంద్రబాబుపై మంత్రి శంకర నారాయణ కీలక వ్యాఖ్యలు…