తెలంగాణ ప్రభుత్వం పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు వైఎస్ షర్మిల. ఇక తాజాగా ఇక్కడ న్యాయం కోసం రోడ్డెక్కాల్సిందే అని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయం కోసం ప్రతిరంగంలోనూ ప్రజలు రోడెక్కుతున్నారని ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు షర్మిల. రాష్ట్రంలోని అన్నదాతలు రోడెక్కుతున్నారని, కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు. విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షం పాలైతున్నాయని మొత్తుకుంటున్నా మీకు రైతు గోస కనపడదు.. వినపడదు.. అని వైఎస్ షర్మిల ట్విట్ చేశారు. చూడాలి మరి దీని పియా తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.