విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గురుపూజోత్సవంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు. గురువు విద్యార్థుల గుండెలపై ముద్ర వేయగలరు అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
గురువు చేసిన పని ఎవరూ చేయలేరన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించారని అన్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్సార్ పులివెందులలో స్కూల్ను స్థాపించారని తెలిపారు.