telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ

ఏపీ సీఎం జగన్ తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అంతకముందు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని గిరిరాజ్‌సింగ్ దర్శించుకున్నారు.

కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో ఈవో సురేష్ బాబు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందించారు. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనకి దారి చూపిస్తుందని కేంద్రమంత్రి అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం ధర్మం కాపాడబడుతుంది, రక్షించబడుతుందని చెప్పారు.

Related posts