telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు..

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని , చంద్రబాబు సైకిల్ టైర్లు ఊడిపోయాయని వైఎస్ జ‌గ‌న్ సెటైర్లు చేశారు.  వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ.. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నార‌ని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌.‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే అని అన్నారు.

రాష్ట్రంలో అందరికీ న్యాయం చేయడానికే మూడు రాజధానులని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నేతలు వారి బినామీ భూములు కోసం మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అని సీఎం జగన్ అన్నారు.

‘మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టండి. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని క్యాడర్‌కు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

Related posts