భారతీయ జనతా పార్టీ ఏపీలో ఈసారి గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని భావిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా సహా కేంద్రమంత్రులు ఇది వరకే ఓసారి ఏపీలో ప్రచారం చేసి వెళ్లారు. తాజాగా, నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏపీకి రానున్నారు. చిత్తూరులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఆయన రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
ఆదిత్యనాథ్ ఏపీలో అడుగుపెట్టడానికి ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్లోని యల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు.