telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

అర్చకుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం: టీటీడీ ఈవో

singhal ttd Eo

అర్చకుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదని చెప్పారు.

కరోనా నయమైన అర్చకుల్లో చాలా మంది ఆలయ విధులకు హాజరవుతున్నారని అన్నారు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులకు చెప్పామని ఈవో వెల్లడించారు. దర్శనాల కోసం అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు.

కరోనా విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకు 743 మందికి తిరుమల క్షేత్రంలో కరోనా సోకినట్టు తేలిందని తెలిపారు. వారిలో 400 మంది కోలుకున్నారని తెలిపారు. ఐదుగురు టీటీడీ ఉద్యోగులు కరోనా సోకి మృతిచెందారని సింఘాల్ వివరించారు.

Related posts