telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధానిపై చంద్రబాబుతీరు సరికాదంటూ ట్వీట్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

 భారీ నిర్మాణాలకు అమరావతి ప్రాంత నేల అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు.శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చంద్రబాబు హేళనగా మాట్లాడాడు. వంద తరాలకు సరిపడా రాజధాని రియల్ ఎస్టేట్ పైనే సంపాదించాలని స్కెచ్ వేశాడు. మూడు ప్రాంతాల గురించి చంద్రబాబు ఎన్నడూ ఆలోచించలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Related posts