telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఇంట్లో ఉందాం ‘కరోనా’ను కలిసి ఎదుర్కొందాం: పీవీ సింధు

pv sindhu player

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగు తున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు స్పందించారు. కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యపరుస్తూ పీవీ సింధు ఓ వీడియో సందేశం పంపారు.

బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కోర్టులోనే ఆడాలని, అప్పుడే గెలుస్తామని, ‘కరోనా’తో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తేనే కోవిడ్-19 పై మనం విజయం సాధించగలమంటూ ఓ పోస్ట్ చేసింది. ‘కరోనా’ కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేసిన సూచనలను పాటిద్దామని, ‘ఇంట్లో ఉందాం..‘కరోనా’ ను కలిసి ఎదుర్కొందాం’ అని ఆమె పిలుపునిచ్చింది.

Related posts