telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మా పార్టీలో కొంత‌మంది నాపై కుట్ర చేస్తున్నారు ..వాళ్ళ‌ అంతు చూస్తా

*మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

*మా పార్టీలో కొంత‌మంది నాపై కుట్ర చేస్తున్నారు ..వాళ్ళ‌ అంతు చూస్తా..
*తనను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు..

*జ‌న‌సేన‌ మహిళా నేత విషయంలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది..

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను కొందరు పార్టీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అన్నారు. ఎవరు చేస్తున్నారో తనకు తెలుసనని, వారి సంగతి తేలుస్తానని బాలినేని శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు.

జ‌న‌సేన‌ మహిళా నేత విషయంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నారు. నా తప్పు ఉందని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

తనపై ఆరోపణలు చేసిన వారితో కొందరు తమ పార్టీకి చెందిన వారే టచ్ లో ఉన్నారన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ తోనే కేసులు ఉపసంహరించుకున్నామని బాలినేని తెలిపారు. ఇదే విష‌యంపై తాను ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నానని, మీ మ‌హిళా నేత విష‌యంలో టీడీపీ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌ని తెలిసింద‌ని, దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. మీ విచార‌ణ‌లో త‌న త‌ప్పు ఉంద‌ని తేలితే త‌న ప‌ద‌వికి , పార్టీకి రాజీనామా చేస్తా అని స‌వాల్ విసిరారు.

అలాగే చైన్నై లో పట్టుబడ్డ డబ్బును తనదే ఆపాదిస్తున్నారన్నారు. తనపై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేయాలని ఎస్పీని కోరుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.పవన్ రిక్వెస్ట్ తోనే కేసులు ఉపసంహరించుకున్నామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Related posts