సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులూ జరగడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘సీఎం వైఎస్ జగన్ గారి రివర్స్ పనులు ఇలా ఉంటాయి. మెడలు వంచుతాం, చేతులు వంచుతాం అని, రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నారు’ అంటూ ట్వీట్లు చేశారు.
‘చంద్రబాబు గారి హయాంలోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 55,648.67 కోట్ల రూపాయలు ఆమోదం పొందాయని, కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెప్పింది. ఇప్పుడు జగన్ గారి అసమర్థత వల్ల, రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయల నష్టమే కాదు, పోలవరం పవర్ ప్రాజెక్ట్ లో వాటా కూడా కేంద్రం అడుగుతుంది’ అని తెలిపారు. ‘ఒక పక్క పనులు జరగటం లేదు, కేంద్రం నుంచి చంద్రబాబు గారి హయాంలో ఖర్చు పెట్టిన డబ్బులు తెచ్చుకోలేరు, ఇప్పుడు ఏకంగా 8 వేల కోట్లు కోత పెట్టారని దుయ్యబట్టారు.