అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వింతగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. స్పీకర్ ను బెదిరించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సభానాయకుడు మాట్లాడుతుంటే అడ్డుతగులుతూ సభకు ఆతనకం కలిగిస్తున్నారని విరుచుకుపడ్డారు. మైక్ ఇవ్వకపోయినా మాట్లాడతారు అంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సభలో ప్రవర్తిస్తే అది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు.
అసెంబ్లీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు బోర్డర్ లైన్ దాటుతున్నారంటూ విమర్శించారు. ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. స్పీకర్ గా అవసరమైతే అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. వెంట్రులాజికమ్ షోలోలా చంద్రబాబు, అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు.