telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రచార సభలో కరెన్సీ నోట్లు..!

YCP padma comments Chandrababu

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సభలో స్థానిక నేత ఒకరు కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు. నియోజకవర్గంలోని సిరివెళ్లలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకొంది.

ఈ డబ్బును తీసుకొనేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొందరు గాయపడినట్టుగా చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే బ్రిజేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆళ్ళగడ్డ టీడీపీ అభ్యర్ధి, మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఈసీకి కూడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related posts