పోలవరం రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండమైన సక్సెసని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం రివర్స్ టెండర్లతో టీడీపీ అవినీతి బయటపడిందన్నారు. ప్రజాధనం ఆదా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై విషం కక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. నాలుగు మాసాలకే ప్రభుత్వంపై బాబు నిప్పులు చెరుగుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల్లో ప్రజలు బాబుకు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరం చూశామని, అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదన్నారు. తండ్రీకొడుకులు ట్వీట్లతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని తెలిపారు. పీపీఏలు పునఃసమీక్షిస్తామంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. . టీడీపీ ఇచ్చిన హామీలు తమని తీర్చమంటే ఎలా? రుణమాఫీ వీలుకాదని సీఎం జగన్ ముందే చెప్పారని పేర్కొన్నారు.