telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం..

హైదరాబాద్ మహానగరంలో వ‌రుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ అల్లుడు కిరాతకుడుగా మారిపోయాడు. కట్టుకున్న భార్యతో పాటు.. పిల్లనిచ్చిన అత్తను కూడా దారుణంగా చంపేశాడు. ఈ జంట హత్యలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి.

స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తతిరుమలగిరి మిలటిరీ ఆస్పత్రిలో పనిచేసే నాగపుష్ప అనే యువతితో అదే ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న చిన్నబాబుతో వివాహం జరిగింది. వీరిద్దరూ తిరుమలగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

అయితే కుటుంబంలో చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో తీవ్రఆవేశానికి లోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించ‌డంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమల గిరి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యకు సంబంధించి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు

Related posts