తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది.. నగరంలోని బ్రాహ్మణ బజారులో ప్రమాదవశాత్తు ఓ భారీ రావి వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. చిన్నారులు క్రికెట్ ఆడుకుందామని రావి చెట్టు కిందకు వెళ్లారు. అదే వారి పాలిట శాపమైంది.
వివర్లాలోకి వెళితే
బ్రాహ్మణ బజారులోని ఉన్న ఆరుగురు చిన్నారులు సాయంత్రం సరదాగా ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలి శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్పై పడింది.
చెట్టు పడడంతో గోడ కుప్పకూలి ఆడుకుంటున్న చిన్నారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు ఆయుష్(12), దిగంత్(8) మృతిచెందారు. మరో ముగ్గురు సాకేత్(8), అనుముల్(5), చరణ్ సాయి(5) స్వల్ప తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కళ్లు ముందే ఆడుకుంటున్న చిన్నారులు నిమిషాల వ్యవధిలోనే విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.