జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో జరిగిన కాల్పులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మొన్నటి ఘటన మరవకముందే మరోసారి అదే రాష్ట్రంలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ రోజు ఉదయం రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను ఓ కానిస్టేబుల్ కాల్చి చంపాడు.
ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ… కమాండర్ రామ్ ఖురేపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్ పేరు విక్రమ్ రాజ్వారే అని చెప్పారు. ఎన్నికల విధుల కోసం జార్ఖండ్ వెళ్లిన ఛత్తీస్ గఢ్ బలగాల బృందంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని వివరించారు. విక్రమ్ ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై అధికారులు ఆరా తీసుస్తున్నారు.
అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రం అసహ్యించుకుంటుంది: రోజా