telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వద్ద శిక్షణ తీసుకున్న కొందరు దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారని అన్నారు. ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

‘దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు’ అని ట్వీట్ చేశారు.

Related posts