ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలపై సభలో వాద్దివేడిగా చర్చ జరుగుతోంది. మరోవైపు, టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన కూర్చున్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వంశీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన పొలిటికల్ కెరీర్ ప్రారంభం నుంచి టీడీపీలోనే కొనసాగిన ఆయన చంద్రబాబుపై చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.