telugu navyamedia
సినిమా వార్తలు

సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు తేజ్‌ ఆరోగ్య పరిస్థితిని క్లోజ్‌గా మానీటరింగ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదం గురించిన తెలుసుకున్న చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు అపోలో ఆసుపత్రికి వచ్చి తేజ్‌ను పరామర్శించారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

ఈరోజు (గురువారం ) మధ్యాహ్నం.. అల్లు అర్జున్.. అపోలో ఆసుపత్రికి వెళ్లి తేజ్‏ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదం గురించి ముందుగా తెలిసిందే బన్నీకే అంటా.. కానీ.. పుష్ప షూటింగ్ కారణంగా కాకినాడ వెళ్లిన బన్నీ.. సాయి ధరమ్‏ను పరామర్శించడానికి రాలేకపోయారు. షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చిన బన్నీ.. వెంటనే తేజ్‏ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

 

Related posts