telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ హీరో

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు.  ఇది ఇలా ఉండగా.. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, మగరాయుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కార్తీక్‌ దగ్గరయ్యాడు. అంతేకాదు మణిరత్నం ఘర్షణ మూవీ ఆయనకు తెలుగులో మంచి పేరు తెచ్చింది. అయితే ఈ సీనియర్‌ హీరో ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల బిజీలో ఉన్నారు. బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున కార్తీక్‌ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగనే శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరారు కార్తీక్‌. ఈ నేపథ్యంలో అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. 

Related posts