telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మున్ముందు కరోనా ఉగ్రరూపం .. డబ్ల్యూహెచఓ సంచలన వ్యాఖ్యలు!

WHO Androse

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి ఇప్పటికే 25 లక్షల మందిని భాధిస్తూ, 1.66 లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయి. లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమేనని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్ అన్నారు. జనీవాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుముందు మహమ్మారి ఉగ్రరూపం కనిపిస్తుందని, ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని తెలిపారు.

కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్ ను శాశ్వతంగా అమలుచేసే వీలు లేదని అన్నారు. సమీప భవిష్యత్తులో ఆరోగ్య విధానం తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన టీడ్రాస్… కరోనాకు, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకు ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్ ఫ్లూ తరహాలోనే, కరోనా సైతం నిదానంగా విజృంభించి ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు.

Related posts