వరుస ఓటములు చివిచూస్తున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ మార్పులు చేసింది.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ప్రస్తుత ఇన్చార్జి కుంతియాను తొలగించిన అధిష్ఠానం..ఆ బాధ్యతలను మాణికం ఠాగూర్ కు అప్పగించింది. ఈ నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.
మాణికం ఠాగూర్ నియామకంపై పొన్నం హర్షం వ్యక్తం చేశారు. మాణికం ఠాగూర్ నియామకంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఎంతో లాభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపేతమవుతుందని అన్నారు. ఠాగూర్ కు విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు.