విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన కోసం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. భద్రత కారణాల రీత్యా చంద్రబాబు నాయుడును ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పోర్టులోని వీఐపీ లాంజ్ కు తరలించారు. విశాఖ పశ్చిమ మండలం ఏసీపీ పేరిట ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆపై అదుపులోకి తీసుకున్నారు.
విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చంద్రబాబును మళ్లీ బయటికి పంపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ఆయన్ను విజయవాడ పంపించేస్తారా లేక హైదరాబాద్ తరలిస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రజా చైతన్య యాత్రకు బ్రేక్ పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.