హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది ఈ ప్రచార చిత్రం. ఇందులో హీరో పిసినారిగా కనిపించాడు. అతని వివాహం అనంతరం ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తుంది. పెళ్లికి విచ్చేసిన బంధువులంతా హీరో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
వాళ్లని కంట్రోల్ చేసే క్రమంలో హీరో సత్య నవ్వులు పూయించాడు. అది ఎక్కువగా వాడొద్దు.. ఇది అంత ఎందుకు అంటూ తన హావభావాలతో ఆకట్టుకుంటున్నాడు. మరి సత్య ఆ ఖర్చంతా ఎలా భరించాడు? వాళ్లని ఎప్పుడు తమ ఇంటికి పంపించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్ఆర్ తదితరులు నటించారు.