బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “వినయ విధేయ రామ” నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు విభిన్నమైన టాక్ వచ్చినప్పటికీ చరణ్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టడంతో మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. బాహుబలి, అజ్ఞాతవాసి తరువాత అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూడవ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక మొదట రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్స్ ను సాధించింది.
తెలంగాణ, ఆంధ్రాలో మొదటిరోజు షేర్స్
నైజాం – రూ. 5.08 కోట్లు
సీడెడ్ – రూ. 7.20 కోట్లు
నెల్లూరు – రూ. 1.6 9కోట్లు
గుంటూరు – రూ. 4.18 కోట్లు
కృష్ణా – రూ. 1.59కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 1. 83 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.45కోట్లు