కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు మరో రూ.3 కోట్ల భారీ ఆర్థిక సహాయం చేశాడు. దేశంలో ఏ సినీ ప్రముఖుడు ఇవ్వనంత విరాళాన్ని ప్రకటించి అక్షయ్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అక్షయ్ భారీ విరాళాలపై బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంత భారీ మొత్తం విరాళం ఇవ్వాలనుకున్నప్పడు ఇలా అందరికీ తెలిసేలా పబ్లిసిటీ చేయడం ఎందుకని అభిప్రాయపడ్డారు. దీని వల్ల అంత మొత్తం సహాయం చేయనివాళ్లని కించపరినట్లు అవుతుందని అన్నారు. అయితే ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అనే పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో శత్రుఘ్నసిన్హా అక్షయ్నే టార్గెట్ చేశారంటూ ఆయనపై నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు సైతం విమర్శలు చేస్తున్నారు. నీకు ఇవ్వడం చేతకానప్పడు ఇతరులను విమర్శించడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై శత్రుఘ్నసిన్హా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. `నేను అక్షయ్ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. అక్షయ్ను టార్గెట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సమాజానికి సేవ చేయడంలో అక్షయ్ ఎప్పడూ ముందుంటార’ని పొగడ్తలు కురిపించారు. అయినప్పటికీ శత్రుఘ్నసిన్హాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
previous post
“మా ” ఎన్నికల్లో డబ్బుల కలకలం..