telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

రోడ్డెక్కిన సిటీ బస్సులు..ఒక సీటులో ఒక్కరే!

AP city bus

ఎట్టకేలకు ఏపీలో ఈ రోజు సిటీ బస్సులు రోడ్డెక్కాయి. విజయవాడనగరంలోని ఆరు మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉదయం సర్వీసులు ప్రారంభించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఒక సీటులో ఒక్కరికి మాత్రమే కూర్చునేందుకు అనుమతి ఇస్తున్నారు.

ఈ నెల 26 వరకు బస్సులు నడుపుతామని ఆర్ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందని బస్సుల్లో 60 శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రతీ స్టాప్ వద్ద ఆర్టీసీ ఉద్యోగి అందుబాటులో ఉంటాడని, శానిటైజ్ చేసిన తర్వాతే ప్రయాణికులను బస్సులోకి ఎక్కిస్తారని తెలిపారు. సీటుకు ఒక్కరు చొప్పున అన్ని సీట్లు భర్తీ అయిన తర్వాత  బస్సు కదులుతోందని  చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరని ఆర్ఎం పేర్కొన్నారు. సిటీ బస్సుల్లో రాయితీలను అనుమతించబోమని తెలిపారు.

Related posts