తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ప్రజలు, ప్రధాని మోదీ ఆశీస్సులతో ఈ రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని ఆయన తెలిపారు.
మీ అందరి మద్దతు ఇకపై కూడా తనకు ఇలాగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తున్నట్టు కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ఈరోజు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఆ రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రచారం చేయడం లేదు: కేజ్రీవాల్