“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది.అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ షూటింగ్ లో బండ్ల గణేశ్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించేందుకు సిద్దమైంది విజయశాంతి. “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం విజయశాంతి సుమారు 55 రోజులు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఆగస్ట్ 9న ఆమె సెట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది. విజయశాంతి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుండగా, ఆమెకి సంబంధించిన సన్నివేశాలపై దర్శకుడు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినట్టు టాక్.
previous post
బిగ్ బాస్-3పై మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్