బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. టామ్హాంక్స్ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్గా ‘లాల్సింగ్ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా 2021 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అయితే తాజాగా అమీర్ పై యూపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ట్రోనికా లో అమీర్ ఖాన్ తన సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. దాంతో అక్కడి స్థానికులు అతన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో ఫ్యాన్స్ తో అమీర్ సరదాగా ఫోటోలు దిగారు. అయితే అమీర్ సామాజిక దూరం పాటించలేదు, కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. దాంతో అమీర్ ఖాన్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేయాల్సిందే అంటూ పోలీసులకు ఎమ్మెల్యే నంద కిషోర్ ఫిర్యాదు చేసారు. దాంతో అమీర్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తుంది.
previous post
next post