యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా రెడ్డి ఆ తరవాత చిరంజీవితో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాలో నటించారు. ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ కుటుంబం ముంబైలో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’తో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను 2014లో పెళ్లి చేసుకున్న తరవాత సమీరారెడ్డి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారు. 2015లో సమీరారెడ్డి దంపతులకు బాబు పుట్టాడు. కిందటేడాది జూలైలో పాపకు సమీరా జన్మనిచ్చారు. సమీరారెడ్డి సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. అయితే సమీరా ఓ కోలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారామె. ఆర్య, విశాల్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందనే టాక్ బయటకొచ్చింది. ఆమె రోల్ సినిమాకు కీలకం కానుందని చెప్పుకున్నారు. తాజాగా అట్టి వార్తలపై స్పందించిన సమీరా.. అవన్నీ అవాస్తవాలని, తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో సమీరా రీ ఎంట్రీ వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
previous post
next post