telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసు : రియా సుశాంత్ లైఫ్‌లోకి వచ్చాక అంతా మారిపోయింది… సుశాంత్ ఫిట్నెస్ ట్రైనర్

Sushanth

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. సుశాంత్ మరణించిన 45 రోజుల తరువాత… సుశాంత్ తండ్రి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడం, రియా కన్పించకుండా పోవడం, పోలీసులకు సంబంధించిన వీడియో లీక్ కావడం తదితర అంశాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇది హత్యేనని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని చాలామంది కోరుతున్నారు. ఆయన మరణానికి కారణం రియా చక్రవర్తి అనేలా కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ ఫిట్‌నెస్‌ ట్రైనర్ సమీ అహ్మద్ తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు. ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో రియా సుశాంత్‌కు ఇప్పించిన ట్రీట్‌మెంట్‌ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ”గత ఐదేళ్ళుగా సుశాంత్, నేను కలిసి పని చేస్తున్నాం. ఆయన ఎంతో మంచివారు. మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. సుశాంత్ నాకు, మా అమ్మకు చాలా క్లోజ్. మే 29న నా తల్లి మరణించినప్పుడు.. ఆ విషయం తెలుసుకుని జూన్ 1న సుశాంత్ ఫోన్ చేసి ఎలాంటి అవసరం వచ్చినా తనకు చెప్పమని ధైర్యాన్ని ఇచ్చారు. ఇక నాతో మాట్లాడిన రెండు వారాల్లోనే ఆయన చనిపోయారన్న వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. ఇక రియా సుశాంత్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. సుశాంత్ మందులు ఏవి తీసుకోవాలన్నా రియానే ఇచ్చేది. డాక్టర్స్ సలహా పాటించకుండానే సుశాంత్‌కు రియా మందులు ఇచ్చి ఉండొచ్చు. సుశాంత్ మానసిక పరిస్థితి తెలియకుండానే రియా తీసుకొచ్చిన డాక్టర్ ఆయనకి చికిత్స చేశారు. మెడిసిన్స్ కూడా ఇచ్చారు” అంటూ సమీ అహ్మద్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Related posts