మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా మంచి విజయాన్ని సాధిస్తుండటంతో ప్రస్తుతం ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న చిరు తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ చిత్రం తెరకెక్కనుండగా, ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్రత్యేక సెట్ కూడా రూపొందించినట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరు 152వ చిత్రం సోషియో థీమ్తో తెరకెక్కనుందని, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. చిరు దేవాదయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తారని టాక్. అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. అయితే చిరంజీవితో గతంలో `స్టాలిన్` సినిమాలో నటించిన త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్ర టైటిల్ :”గోవిందం ఆచార్య” అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ టైటిల్తో పోస్టర్ కూడా రూపొందించి వైరల్ చేస్తున్నారు. పోస్టర్లో చిరు కమ్యూనిస్ట్ గెటప్లో గన్ పట్టుకొని ఉండగా, వెనుక దళం ఉంది. ఫ్యాన్స్ తయారు చేసిన ఈ పోస్టర్ ఒరిజనలా కాదా అనే దానిపై అభిమానులు సందిగ్ధం చెందుతున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ స్పందించింది. మేము ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని, టైటిల్ పెట్టిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం అని క్లారిటీ ఇచ్చారు.
#Chiru152 title is not finalzed yet. We will officially announce the title and further details about the project once finalized.
— Konidela Pro Company (@KonidelaPro) 17 October 2019