సీఎం కేసీఆర్పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రిత వ్యవసాయంపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్ కన్ఫ్యూజ్ సీఎం అయ్యారని… రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీకి సరెండర్ అయ్యారని.. కేసీఆర్ ది దృతరాష్ట్రుడి పాలన అని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కేసీఆర్.. నిర్ణయాలు సీఎం గా తీసుకుంటే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని.. నేను రైతుని అంటాడు… రైతుగా అయినా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సన్న వడ్లు వేయాలన్న కేసీఆర్.. ఇప్పుడు వాటిని కొనలేక చేతులు ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు సన్న వడ్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. అమిత్ షాకి కేసీఆర్ సరెండర్ అయ్యాడని… అందుకే కేంద్ర తెచ్చిన చట్టాలను సమర్దిస్తున్నాడని ఫైర్ అయ్యారు. సీఎం పోస్టు అనుకున్నాడా… చెప్రాసి అనుకున్నాడా..? బాధ్యతగా మాట్లాడాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అటు పొన్నం ప్రభాకర్ కూడా సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రైతులను మోసం చేసి… కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తరిమి కొట్టే రోజులు వచ్చాయని.. మాటలు చెప్తాడు కానీ.. చేతలు మాత్రం ఉండవని కేసీఆర్పై విరుచుకుపడ్డారు.
previous post