టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాపరంగాను మంచు మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తరువాత సినిమాలకు దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. ఇటీవల తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మంచు మనోజ్. స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు.. సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రస్టింగ్ పోస్ట్లు షేర్ చేసే మంచు మనోజ్ ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “ఫైర్ బాల్గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి” అంటూ పోస్ట్ పెట్టారు. అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే.. మనోజ్ ట్వీట్కి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. మళ్లీ పెళ్లా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే నెటిజన్ల కామెంట్స్ స్పందిస్తూ ‘వామ్మో’ అని రిప్లై ఇచ్చారు మంచు మనోజ్. అయితే మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లి గురించి కాదని.. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించింది అని కొందరు అంటుంటే.. మనోజ్ కొత్త బ్యానర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి మంచు మనోజ్ చెప్పబోయే అసలు విషయమేంటో చూడాలి.
Now that I am all set to glow like a fire ball🔥 I would like to announce something interesting in a week’s time. Stay tuned 😎🤗 pic.twitter.com/zKHJy1xIAp
— MM*🙏🏻❤️ (@HeroManoj1) January 28, 2020
Vamooooo https://t.co/HeW23snc83
— MM*🙏🏻❤️ (@HeroManoj1) January 28, 2020