telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేసీఆర్ కుమారుడు గెలిస్తే…లోకేష్ మాత్రం తుక్కైపోయాడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి  టిడిపి నేత నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. అందరి కుమారులు రాజకీయాల్లో మంచి విజయాలు సాధిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని ఎద్దేవా చేశారు. “వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు. తల్లిదండ్రులిద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పుడు పిల్లలకు వ్యాధి సోకకుండా సిఎం జగన్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 బాలల సంరక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సంక్షోభ సమయంలో దేశంలోనే ఇటువంటి మానవత కనబర్చిన రాష్ట్రం మనది. యువ సిఎం ట్రెండ్ సెట్ చేశారు. ప్రభుత్వం వద్దని మొత్తుకున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని స్థానిక ఎన్నికలు జరిపించాడు బాబు. కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచిని వదిలి పెట్టదు. ఎన్నికలు లేకుంటే పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేది. ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉండేవి కాదు.” అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

Related posts