telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి

YCP Vijayasai Reddy Fire Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ట్విటర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు బెదిరించడం వల్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకొచ్చారని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్లో చేరమని హైదరాబాద్‌లో బెదిరిస్తున్నారని చంద్రబాబు కలవర పడుతున్నారు. మీకు ప్రపంచమంతా ఆస్తులున్నాయి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా అని ప్రశ్నించారు.

10 ఏళ్ల రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ.. మరీ అప్పుడెవరు వార్నింగిచ్చారో చెప్పండి.’ అని నిలదీశారు. మరో ట్వీట్‌లో.. ‘వ్యవసాయం దండగ, రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నచంద్రబాబు పాలనలో రైతులకు భద్రత ఎక్కడుంటుందని మండిపడ్డారు.

Related posts