తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మంచి నటుడిగానే కాదు, మంచి మనసున్న వ్యక్తిగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన “96” చిత్రం విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు ప్రాజెక్టులతో విజయ్ సేతుపతి చాలా బిజీగా ఉన్నారు. శీను రామసామి దర్శకత్వంలో రూపొందుతున్న “మామనిథాన్” సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ సినిమా సెట్లో తనకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటూ ఓ నటి విజయ్ సేతుపతిని కలవగా… ఆ సీనియర్ నటిని ఆప్యాయంగా పలకరించిన విజయ్ సేతుపతి కొంత నగదు ఆమెకు ఇచ్చాడు. అయితే విజయ్ సేతుపతి నుంచి డబ్బులు తీసుకుని వెళ్తున్న ఆ మహిళ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయిందట. అది చూసిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారట. కవలమ్ అచ్చమ్ అనే ఈ సీనియర్ నటి జయరామ్ నటించిన “ఎన్జన్ సాల్పేరు రమన్కుట్టీ” చిత్రంతో చాలా పాపులర్ అయ్యింది. ఆ తరువాత ఆమె పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు.
People Selvane You Are Simple Manthaane.#VijaySethupathi😍 pic.twitter.com/ebwGIdSglC
— VijaySethupathi.com (@VijaySethu_com) January 29, 2019