కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ను పొందింది. ఈ నేపథ్యంలో వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 9న ‘లాభం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు.
కాగా ..ఈ సినిమాలో సేతుపతి డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపుదిద్దుకుందని, ఢీ అంటే ఢీ అనేలా ఉన్న సేతుపతి, జగపతిబాబు పాత్రలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని మూవీ టీం తెలిపింది.