సీజన్ 1, సీజన్ 2లలో హోస్ట్ , కంటెస్టెంట్స్, హౌజ్ మారాయి తప్ప బిగ్ బాస్ మారలేదు. అదే పంథాలో తన వాయిస్తో కొత్త కంటెస్టెంట్లని అదుపులో ఉంచుతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1, నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2, ఇప్పుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లలో ఎవరికీ కన్పించకుండా గాంభీర్యమైన గొంతుతో భయపెట్టించే ఆ వ్యక్తి అప్పుడప్పుడు టాస్క్లు ఇస్తూ, రూల్ అదిగమిస్తే వారిని హెచ్చరిస్తూ ఉంటారు. అజ్ఞాతవాసిలా ఉండే బిగ్ బాస్ ఎవరనే విషయాన్ని సీజన్ 1 పూర్తైన తర్వాత రివీల్ చేస్తారని అప్పట్లో అందరు భావించారు. కాని అలాంటిదేమి లేకుండా షో ముగించేశారు. సీజన్ 2 లోను బిగ్ బాస్ది అదే గొంతు కాగా ఆయన ఎవరనేది రివీల్ చేయలేదు. సీజన్ 3లోను అదే గొంతు ఇంట్లో వినిపిస్తుంది. గంభీరమైన గొంతుతో ఉన్న ఆ గంభీరమైన మనిషి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఆ బిగ్ బాస్ మరెవరో కాదు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధా కృష్ణ. బిగ్ బాస్ వాయిస్ కోసం ఎంతోమందితో ఆడిషన్స్ చేయించి చివరికి ఈయనని సెలక్ట్ చేశారు. మా టీవీలో వచ్చిన సీఐడీ సీరియల్లో కూడా ఈయన డబ్బింగ్ చెప్పేవారు. అయితే ఆ గొంతు ఇంతకముందు విన్నారనే ఫీల్ రాకుండా, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా చేయటంలో రాధాకృష్ణ విజయం సాధించాడు. ఈ క్రమంలో మూడు సీజన్స్కి ఆయననే తన వాయిస్తో బిగ్ బాస్గా మెప్పిస్తున్నాడు. ఇప్పుడు తెలుగులో రాధాకృష్ణ కూడా బిగ్ బాస్గా సక్సెస్ సాధించాడనే చెప్పవచ్చు. హిందీ బిగ్ బాస్ లో గంభీరమైన వాయిస్ తో అతుల్ కపూర్ బిగ్ బాస్ గా అలరించాడు.
previous post