యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్తో వీరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కు ఆయన స్టార్ ఇమేజ్కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సునీల్ విలన్గా కనిపించనున్నాడట. అరవింద సమేతలో త్రివిక్రమ్ క్యారెక్టర్ ఇచ్చినా సునీల్ పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఎలాగైనా.. తన ఫ్రెండ్కి మంచి బ్రేక్ ఇవ్వాలని ఈ సినిమాలో విలన్ రోల్ ఇస్తున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే… దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. “కలర్ ఫోటో” సినిమాతో సునీల్ విలన్గా అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే..
previous post